కష్ట తరమైన కాన్పు ను సులభతరమైన పద్దతిలో చేసిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి

 

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు 28 వ తేదీన కాన్పు కోసం వచ్చిన షేక్ షబానా తన మూడవ కాన్పు కోసం రావడం బిడ్డ బరువు ఎక్కువ ఉండటం వలన సాధారణ కాన్పు చేయడం ఇబ్బందికరం అయినప్పటికీ గైనకాలజీ సిబ్బంది అందరు కలిసి ఎంతో ఓపికగా తల్లిని, బిడ్డని క్షేమంగా అదునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సాధారణ కాన్పు చేయడం.జన్మించిన బాబు 4.4 kg ఆరోగ్యం గా ఉన్నాడు అని తెలిపారు. హాస్పిటల్ సూపరేండెంట్ డాక్టర్ హుస్సేన్ ప్రభుత్వం ఆసుపత్రి నందు అత్యంత మెరుగైన పరికరాలు, కావాల్సిన అన్ని సదుపాయాలు మెరుగైన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రి నందు అందిస్తున్నామని ఈ విషయం ప్రజలు అందరు గమనించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.

బైట్స్..

డాక్టర్ హుస్సేన్
కదిరి ఆసుపత్రి సూపరేండెంట్.

Posted Under AP
Editor