ప్రశాంత్ కిశోర్ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి లోకేశ్తో కలసి విజయవాడ వచ్చారు. నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికలకు ముందు ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి.. వంటి అంశాలపై వారు చర్చించినట్టు తెలిసింది. ప్రాంతాలవారీగా అనుసరించాల్సిన ఎన్నికల ప్రణాళికలు, ప్రచార వ్యూహాలపై చర్చ జరిగినట్టు సమాచారం.
ఎన్నికల వ్యూహాలపై బాబు, పికె చర్చ
