శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ – రెండు నెలల గదుల కోటా విడుదల..!!

Tirumala: తిరుమల భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదుల కోటాను విడుదల చేస్తోంది.

ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన గదుల కోటా విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరిలో అనుమతులపై తాజాగా సమయాలను ఖరారు చేసారు.

గదుల కోటా విడుదల: ప్రతీ నెలా నిర్దేశించిన షెడ్యూల్ మేరకు శ్రీవారి సేవలు..దర్శన..టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన గదుల కోటాను జూన్ 26న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతి, తలకోన ప్రాంతాల్లోని గదులను భక్తులు బుక్ చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది.

భక్తులు

Posted Under AP
YES9 TV